- ధాన్యంను కొనుగోలు చేయాల్సిన బీజేపీ టిఆర్ఎస్ ధర్నా లు చేస్తున్నారు
- రైతులను పక్క దారి పట్టించే ప్రయత్నాలు
మన్యం టీవీ మంగపేట.
ధాన్యం కొనుగోళ్లపై బీజేపీ టి ఆర్ఎస్ ఒకరి మీద ఒకరు మీరు కొనాలి అంటే మీరు కొనాలి అంటూ రైతులను మోసం చేస్తు పక్క దారి పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా మహిళా అధ్యక్షురాలు కొమరం ధనలక్ష్మి పత్రిక ప్రకటనలో విమర్శించారు.శనివారం ఆమె విలేకరులతో మా ట్లాడుతూ కేంద్రంలో పాలించే బీజేపీ రాష్ట్రన్ని పాలించే టిఆర్ ఎస్ ఇద్దరు రోడ్డెక్కి ధర్నాలు చేస్తే కొనాల్సినది ఎవరో రైతులకు రెండు పార్టీలు సమధా నం చెప్పాలని ధనలక్ష్మి ప్రశ్నిం చారు.ధాన్యం కొనాల్సిన వారే ఎందుకు ధర్నాలు చేస్తున్నారో అర్థం కావడం లేదని అన్నారు. ధాన్యం కొనుగోలు చేయడం మీకు సాధ్యం కాద? అధికారంలో ఉండి ప్రజాస్వా మ్యన్ని అపహాస్యం చేస్తున్నారు వీళ్ల పాలనలో రాష్టాన్ని డేశాన్ని 20 ఏళ్ళు వెనక్కి నెట్టారని ధాన్యం కొనుగోళ్ల విషయంలో బీజేపీ టిఆర్ఎస్ ఒకరిపై ఒకరు బురద జల్లుకుంటు ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నారని మండిప డ్డారు.ఇకనైనా ధర్నా లు నిరసనలు మని రైతు లు పండించిన పంటను కొనుగోలు చేయాలని అన్నారు.
Post A Comment: