భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్దత్ ఎదుట లొంగిపోయారు. ఇందుకు సంబందించిన వివరాలను ఎస్పీ సునీల్దత్ మీడియాకు వెల్లడించారు. చర్ల ఏజెన్సీ ప్రాంతానికి చెందిన 20 మంది గత ఏడాది కాలంగా సీపీఐ మావోయిస్టు పార్టీలో చేరారని తెలిపారు. వీరంతా చర్ల ఏరియా కమిటీ కార్యదర్శి అరుణ నేతృత్వంలో పనిచేసే వారని తెలిపారు. ఇటీవల కాలంలో మావోయిస్టు పార్టీలో చేస్తున్న వేదింపులకు తట్టుకోలేకపోయారని తెలిపారు. తరుచుగా తమను బియ్యం, నిత్యావసర వస్తువుల కోసం వీరిని వేదించేవారని తెలిపారు. ఇటీవల వీరిని పెసర్లపాడు, పుట్టపాడు, చందా ప్రాంతాలకు ట్రైనింగ్ క్యాంపులకు పంపారని, అక్కడ ఇమడలేక పోలీసుల ఎదుట స్వచ్చందంగా లొంగిపోయారని తెలిపారు. మిగిలిన మావోయిస్టులు సైతం జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని తెలిపారు.
Navigation
Post A Comment: