మన్యం టీవీ మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో మంగళవారం సూర్య తెలుగు దినపత్రిక 15వ వార్షికోత్సవం ప్రత్యేక సంచికను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు చేతుల మీదుగా ఆవిష్కరించారు.ఈ సందర్భంగా విప్ రేగా కాంతారావు సూర్య దినపత్రిక యాజమాన్యానికి,సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసి పొశం. నర్సింహారావు,మార్కెట్ కమిటీ డైరెక్టర్ సకిని. బాబురావు,సూర్య దినపత్రిక ఆర్ సి ఇంచార్జి వెంకట్, టిఆర్ఎస్ పార్టీ భుర్గంపాడు మండల అధ్యక్షులు గోపిరెడ్డి రమణారెడ్డి,యువజన అధ్యక్షులు సాగర్ యాదవ్, మైనారిటీ సెల్ నాయకులు హాబీబ్,ప్రజాప్రతినిధులు,పార్టీ నాయకులు,యువజన నాయకులు,సోషల్ మీడియా సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: