మన్యంటీవి, అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం, ఊట్లపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ సాధు జోత్స్న భాయ్ గ్రామ పంచాయతీ పనులు విధులు సరిగా నిర్వహించలేక పోతున్నానని 5 రోజుల క్రితం సర్పంచ్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి రాజీనామా దరఖాస్తును ఎంపీఓ సీతారామరాజుకు అందించిన విషయం అందరికీ తెలిసిందే, అయితే ఇది ఇలా ఉండగా ఆమెకి ఆమె ధైర్యం చెప్పుకొని తనను నమ్మి ఓట్లు వేసిన ప్రజలు నమ్మకాన్ని నిలబెట్టడానికి తను ఎన్ని కష్టాలైనా భరిస్తా అని ఊట్లపల్లి గ్రామ పంచాయతీ అభివృద్ధి తన లక్ష్యమని రాజీనామాను ఉపసంహరించుకున్నట్లు ఆమె తెలిపారు. ఈ సందర్భంగా అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావునీ మర్యాదపూర్వకంగా ఆమె కలిశారు. ఊట్లపల్లి గ్రామ పంచాయతీ అభివృద్ధికి తన వంతు సహకారం పూర్తిస్థాయిలో ఉంటుందని ఎమ్మెల్యే మెచ్చా హామీ ఇవ్వడంతో అభినందనలు తెలుపుకున్న సర్పంచ్ సాధు జోత్స్న భాయ్. ఈ కార్యక్రమంలో మండల నాయకులు మోహన్ రెడ్డి పాల్గొన్నారు.
Navigation
Post A Comment: