గత మే నెలలో జరిగిన గుర్తింపు సంఘ ఎన్నికలలో 188 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందిన TNTUC నీ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు మంగళగిరిలోని పార్టీ ఆఫీసుకు ఆహ్వానించి అభినందించడం జరిగింది. ఈ సందర్భంగా గుర్తింపు సంఘ ఎన్నికలలో వివరాలను అడిగి తెలుసుకుని TNTUC రాష్ట్ర జనరల్ సెక్రెటరీ పోటు రంగారావు గారు , ITC TNTUC అధ్యక్షులు కనక మేడల హరి ప్రసాద్, చైర్మన్ గల్లా నాగ భూషయ్య మరియు కార్యవర్గ సభ్యులను అభినందించడం జరిగింది. ఇదే స్ఫూర్తితో ముందుకు వెళుతూ కార్మికులకు మెరుగైన వేతన ఒప్పందం అందించాలని కోరడం జరిగింది. ఈ సందర్భంగా పోటు రంగారావు గారు మాట్లాడుతూ పాలనలో చంద్రబాబు గారి విజనరీ ఆదర్శనీయమని, తాను కూడా దానిని ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్లానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో TNTUC రాష్ట్ర అధ్యక్షులు MK బోస్, రాష్ట్ర జనరల్ సెక్రెటరీ వి రత్నాకర్ గారు, మరియు రాష్ట్ర కమిటీ సభ్యులు ITC భద్రాచలం టిఎన్టియుసి కార్యవర్గం, తెలుగుదేశం పార్టీ మండల నాయకులు తాళ్లూరి జగదీశ్వర రావు గారు, కంచే టి వెంకటేశ్వరరావు, కాకర్ల సత్యనారాయణ పాల్గొనడం జరిగింది.
Post A Comment: