CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ప్రగతిశీల పంచాయతీ వర్కర్స్ యూనియన్(I.F.T.U) మండల కమిటీ ఎన్నిక

Share it:

 



మన్యం టీవి టేకులపల్లి :


ఈ రోజున ప్రగతిశీల పంచాయతీ వర్కర్స్ యూనియన్ ఐ ఎఫ్ టి యు మండల కమిటీ ఎన్నిక జరిగినది ఈ సందర్భంగా ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షులు టి. నాగేశ్వరరావు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నారని కార్మికులతో ఎట్టి చాకిరీ చేపిస్తూ వారికి కష్టానికి ఫలితం లేకుండా వేతనం ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు పంచాయతీ వర్కర్స్ వాళ్లకు కనీస వేతనం 24 వేల రూపాయలు ఇవ్వాలని వారికి హెల్త్కార్డులు పీఎఫ్ కటింగ్ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ప్రమాదవశాత్తు పంచాయతీ వర్కర్స్ మరణిస్తే 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని పంచాయతీ వర్కర్స్ లవేధింపులు ఆపాలని 12 గంటల పని దినాలు రద్దుచేసి ఎనిమిది గంటల పనిని మాత్రమే అమలు చేయాలని ఆదివారాలు పండగ రోజులలో సెలవు దినంగా ప్రకటించాలని లేనిపక్షంలో దశలవారీగా ఆందోళన ఉదృతం చేస్తామని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు

పంచాయతీ వర్కర్స్ యూనియన్ ఐ.ఎఫ్.టి.యు మండల కార్యదర్శి జరుపుల సుందర్ అధ్యక్షులు సరికొండ నాగేశ్వరరావు ఉపాధ్యక్షులు ఈ సం మహేష్ సహాయ కార్యదర్శి పి .మంగారావు కోశాధికారిగా సజ్జ ప్రశాంత్ తో పాటు ఎనిమిది మంది సభ్యులుగా నియమితులయ్యారు ఈ కార్యక్రమంలో ఎఫ్ టి ఏరియా కమిటీ నాయకులు లాలయ్య సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ మండల కార్యదర్శి వెంకటేశ్వర్లు మండల నాయకులు ఎట్టి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు

Share it:

TELANGANA

Post A Comment: