మన్యం టీవీ : ఇల్లందు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు డాక్టర్. జి.రవి ఇటీవల అనారోగ్యం బారిన పడిన ప్రియతమ నాయకులు జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్, భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య గారు త్వరితగతిన కోలుకోవాలని మరియు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని స్థానిక ఇల్లందు పట్టణలోని ప్రసిద్ధ అభయాంజనేయ అయ్యప్ప దేవస్థానం నందు బ్రహ్మ శ్రీ లక్ష్మీ ప్రసన్న కుమార్ అర్చకుల చే సుదర్శన, చండీ యాగం నిర్వహించారు. ఈ యాగం లో సీనియర్ కాంగ్రెస్ నాయకులు జీవి భద్రం, మాజీ కౌన్సిలర్ ధరావత్ క్రిష్ణ, కోటగిరి నవీన్ కుమార్, శ్రీను, రవి, అరవింద స్వామి పాల్గొని పొదెం వీరయ్య గారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు .
Post A Comment: