మన్యం టీవి,ములకలపల్లి : మండల కేంద్రం పంచాయతీ ఆఫీస్ దగ్గర మరియు శ్రీ భక్తా ఆంజనేయ స్వామి దేవాలయ లో దుర్గమ్మ పూజ కార్యక్రమంలో పాల్గొని,స్థానికంగా బతుకమ్మ ఆడుతున్న అడపడుచులతో కలిసి కొద్దిసేపు బతుకమ్మ ఆడారు,అనంతరం కోదుమూరి కామేశ్వరరావు వారి తల్లిదండ్రులు జ్ఞాపకార్థం గా ములకలపల్లి పంచాయితీ గ్రామానికి చెందిన 12 మంది మహిళలకు ములకలపల్లి మాజీ జెడ్పిటిసి బత్తుల అంజి చేతుల మీదగా ఆడపడుచులకు చీరలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో బండి కొమరయ్య,శనగపాటి రవి, ములకలపల్లి టిఆర్ఎస్ పార్టీ కార్యదర్శి శనగపటి.అంజి, ఆర్.ఎం.పి డాక్టర్ కొమ్ముజు నాగరాజు, బిక్షం,టిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా అధ్యక్షులు దుగ్గి సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: