👉ప్రభుత్వ విప్ రేగా లేఖపై స్పందించిన ఎస్ బీఐ జనరల్ మేనేజర్
👉హర్షం వ్యక్తం చేస్తున్న మండల వాసులు
కరకగూడెం:ఏజెన్సీ కరకగూడెంమండల కేంద్రంలో ఎస్ బీ ఐ బ్యాంక్ నూతన బ్రాంచ్ ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ప్రత్యేక చొరవ తీసుకొని ఈ నెల 4వ తేదీన ఎస్ బీఐ నూతన బ్రాంచ్ మండల కేంద్రంలో ఏర్పాటు చేయాలని ఎస్ బీఐ బ్యాంక్ జనరల్ మేనేజర్ క్రిషాన్ శర్మకు విప్ రేగా కాంతారావు లేఖ రాసారు.
దీనిపై స్పందించిన ఆయన డిప్యూటీ జనరల్ మేనేజర్(బీ ఓ),అడ్మినిస్ట్రేటివ్ వరంగల్ కార్యాలయం వారికి నూతన బ్రాంచ్ ప్రారంభించడానికి సాధ్యాసాధ్యాలను అన్వేషించడానికి ఒక సర్వే నిర్వహించాలని తాము సూచించినట్లు,అలాగే ఈ విషయంలో తాము మీకు పూర్తి సమాచారాన్ని త్వరలోనే తెలియజేస్తామని విప్ రేగాకు తిరిగి రాసిన లేఖలో తెలిపారు.
ఇదిలా ఉండగా ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్ బీఐ) బ్యాంక్ బ్రాంచ్ మండలంలో ఏర్పాట్లు చేయనున్నడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కాగా కరకగూడెం కేంద్రంలో ఏపీజీవీబీ బ్యాంక్ బ్రాంచ్ మాత్రమే అందుబాటలో ఉంది.
Post A Comment: