CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి:సిపిఎం

Share it:

 


మన్యం టీవి, మణుగూరు:

మణుగూరు పట్టణ కేంద్రం లో పూల మార్కెట్ రహదారి పైన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మణుగూరు మండల సీనియర్ నాయకులు నెల్లూరు నాగేశ్వరరావు మాట్లాడుతూ గత పది నెలలుగా . నూతన వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని రైతులు వివిధ రూపాల్లో ఆందోళన చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం చట్టాలు రద్దు చేయకుండా రైతుల్ని ఉగ్రవాదులని, దేశద్రోహులను అని బెదిరిస్తూ రైతుల పై తప్పుడు కేసులు పెడుతున్నారు. ఇటీవల ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని లక్ష్మీపూర్ లో కేంద్ర సహాయ మంత్రి అజయ్ మిశ్రా వస్తున్నారని రైతులు ప్రజాస్వామ్యయుతంగా ఆందోళన చేస్తుంటే మంత్రి కొడుకు ఆశిష్ మిశ్రా రైతులపై కారు వేగంగా నడుపుకుంటూ నలుగు రైతుల్ని పొట్టన పెట్టుకున్నారని ఇది బిజెపి ప్రభుత్వం రైతుల పై దాడులు చేయమని మంత్రులు ఎమ్మెల్యేలు నిస్సిగ్గుగా పేర్కొన్నారని ఈ చర్యను సిపిఎం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని భవిష్యత్తులో రైతులను సమీకరించి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం కరకగూడెం మండల కార్యదర్శి సత్తనపల్లి సాంబశివరావు. నరసింహారావు శివ తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: