👉 గ్రామ పంచాయతీలకు చేప పిల్లలు పంపిణీ కార్యక్రమంలో జెడ్పిటిసి నాగమణి మాన్యం టివి:ములకలపల్లి మండలం: ములకలపల్లి మండల ప్రజాపరిషత్తు కార్యలయం లో జిల్లా మత్స్య శాఖ ద్వార 5,14,500 . బొచ్చె ,బంగారుతీగ ,శిలవతి రకాల చేప పిల్లలను ములకలపల్లి జడ్పీటీసీ సున్నం నాగమణి పంపిణీ చేశారు.ఈ సందర్బంగా జడ్పీటీసి నాగమణి మాట్లాడుతూ 100% రాయితీపై 4గిరిజన మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలకు 10 గ్రామ పంచాయతీలకు,మొత్తము 31 చెరువులకు చేప పిల్లలు పంపిణీ చెయ్యటం జరిగింది. ఈ కార్యక్రమంలో ములకలపల్లి ఎంపిటిసి మోహరమణి,ములకపల్లి సర్పంచ్ బిబినేని భద్రం, మాదారం సర్పంచ్ వాడే నాగరాజు,జిల్లా మ త్స్య శాఖ క్షేత్రస్థాయి అధికారి యన్ కోటేశ్వరరావు ,మరియు సిబ్బంది మీడియం మంగరాజు తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: