మాన్యం టివి:ములకలపల్లి మండలం:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,అశ్వరావుపేట నియోజకవర్గం,ములకలపల్లి మండలానికి సంబంధించి మొత్తం12 మంది లబ్దిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు రూ.5,65,500.ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు మరియు అశ్వరావుపేట శాసనసభ్యులు మెచ్చ నాగేశ్వరరావు చేతుల మీదగా పంపిణీ చేయడం జరిగింది.ఈ సందర్బంగా ఎంపీ నామనగేశ్వర రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను ప్రజలకు అందజేస్తున్న ఒకే ఒక వ్యక్త మన టి ఆర్ ఎస్ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ అని,మనం ఎప్పుడు ఎల్లవేళలా ఆయనకి రుణపడి ఉండాలని,వారు చెప్పడం జరిగింది.ఈ కార్యక్రమంలో అశ్వరావుపేట నియోజకవర్గం టిఆర్ఎస్ పార్టీ నాయకులు జారే ఆదినారాయణ, ములకలపల్లి టీఆరెస్ పార్టీ మండల అధ్యక్షుడు మోరంపూడి అప్పారావు, మండల కార్యదర్శి శనగ పాటి అంజి, టిఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు మాది బోయిన సత్యనారాయణ,సీతారాంపురం సర్పంచ్ సున్నం సుశీల,టిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా దుగ్గి సంపత్ కుమార్,టి ఆర్ ఎస్ వి. మండల అధ్యక్షుడు గుంటూరు కృష్ణ ,కుజా వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: