గుండాల ఎస్ ఐ డి సురేష్
గుండాల అక్టోబర్ 9 (మన్యం మనుగడ) క్రీడల్లో రాణించి కూడా ఉద్యోగాలు సాధించవచ్చని గుండాల ఎస్ ఐ డి సురేష్ యువతకు సూచించారు. శనివారం యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ ను ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. చదువుతోపాటు క్రీడల్లో సైతం రాణించాలని ఆయన కోరారు. క్రీడల్లో రాణించి కూడా ఉద్యోగాలు సాధించవచ్చని ఆయన యువతకు సూచించారు. క్రీడల్లో పాల్గొనడం ద్వారా శారీరక దృఢత్వం కూడా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో వివేకవర్ధని ప్రిన్సిపాల్ వరలక్ష్మి, నిర్వాహకులు, క్రీడాకారులు పాల్గొన్నారు
Post A Comment: