ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ రవీందర్
కళాశాల ప్రిన్సిపల్ నవీన జ్యోతి
గుండాల అక్టోబర్ 9 (మన్యం మనుగడ) పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం మన అందరి బాధ్యత అని ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ రవీందర్, గుండాల జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ నవీన జ్యోతి అన్నారు. శనివారం అజా ధిక అమృత్ మహోత్సవం కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రంలోని రహదారులు పాఠశాలలు మరియు బస్సుల కోసం ప్రయాణికులు వేచి ఉండే ప్రాంతాలలో స్వచ్ఛత కార్యక్రమాన్ని చేపట్టారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం వలన ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తవని వారు సూచించారు. ముందుగా మనం ఆచరించి పది మందికి ఆదర్శంగా నిలవాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ బాలస్వామి, లెక్చరర్స్ చైతన్య , సతీష్ రెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు
Post A Comment: