గుండాల అక్టోబర్ 9( మన్యం మనుగడ) బి ఎస్ పి వ్యవస్థాపకులు కాన్సిరాం 15 వ వర్ధంతి కార్యక్రమాన్ని బి ఎస్ పి ఆధ్వర్యంలో మండలం పరిధిలోని సాయన పల్లి గ్రామంలో నిర్వహించారు. అనంతరం బి ఎస్ పి కొత్తగూడెం జిల్లా నాయకులు బొమ్మెర రాంబాబు మాట్లాడుతూ పార్టీని స్థాపించి విజయపథంలో నిలిపిన ఆయన కృషి ఎప్పటికి మరువలేము అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా బి ఎస్ పి పార్టీ అధికారంలోకి వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బొమ్మెర జయ బాబు, వాగా బోయిన చంద్రయ్య దొర, బొమ్మెర శ్రీను, సమ్మయ్య , తదితరులు పాల్గొన్నారు
Post A Comment: