మన్యం టీవీ : ఇల్లందు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు తెలంగాణ ప్రజలు అత్యంత సంబరాలతో చేసుకుని బతుకమ్మ పండగ, దసరా పర్వదినం సందర్భంగా మహిళలు పిల్లలు షాపింగ్ చేసి కొత్త దుస్తులు కొనుక్కొలేని దయనీయ స్థితిలో అంగన్ వాడీ వర్కర్స్ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 2021 జూలై లో 11వ పిఆర్సి లో పెంచిన 30 శాతం నెలకు టీచర్ కు 3650, ఆయా,మిని టీచర్ కు 1800 ల చొప్పున మూడు నెలల ఎరియర్స్ ప్రభుత్వం ఇస్తుందని అంగన్వాడీ మహిళలు ఎంతో ఆశగా ఎదురుచూశారు. గత సెప్టెంబర్ పెండింగ్లో ఉన్న వేతనాలు కూడా ఇవ్వలేదు. ఇప్పటికైనా తక్షణం రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలకు రావలసిన బకాయిలు చెల్లించి మహిళలు పండుగ చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్న అంగన్వాడీ టీచర్లు పండగ రోజు పస్తులు ఉండాల్సిన పరిస్థితి వస్తుందని అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సి ఐ టి యు) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షురాలు వెంకటమ్మ వాపోయారు. ఇల్లందు సీఐటీయూ కార్యాలయంలో జరిగిన అంగన్వాడి యూనియన్ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉన్న అంగన్వాడీ టీచర్ ల ను ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని తెలిపారు కల్లేపల్లి మరియు అధ్యక్షతన జరిగిన సమావేశంలో నందు ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యదర్శి షేక్ ఫాతిమా, యాదమ్మ, శ్రీలత, అంజమ్మ, మంగ, రాంబాయి,రాధ,దయావతి తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: