మన్యం టీవీ ఏటూరు నాగారం
ఏటూరు నాగారం మండల కేంద్రంలో గురువారం ములుగు ఎమ్మెల్యే సీతక్క కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి చిత్ర పటానికి పాలాభిషేకం చేసిన బహుజన పూజారుల శివసత్తుల సేవాసమితి
ఏటూరు నాగారం మండల అధ్యక్షురాలు మారబోయిన బేబీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ములుగు జిల్లా అధ్యక్షురాలు తిరుపతమ్మ హాజరై సీతక్క చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.బహుజన పూజారుల శివసత్తుల సేవా సమితి ఏటూరు నాగారం ఆధ్వర్యంలో నిండు అసెంబ్లీ సాక్షిగా జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ... బహుజన పూజారుల శివసత్తులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారిని గుర్తించి ఈ పూజరుల యొక్క డిమాండ్స్ నేరవేర్చాలని ఇతర ఆలయాల్లో పూజరుకు కాని క్రీస్టియన్ చర్చిలలో ఫాదర్ ఫాస్టర్ లకు ఇతర మతాలకు పూజరులకు ప్రభుత్వ వేతనం ఎలా వస్తుందో ఈ గ్రామాలలో ఉండే బహుజన పూజారులు శివసత్తుల కు వేతనాలు కల్పించాలని ప్రభుత్వం ను కోరారని,ఎమ్మెల్యే సీతక్క ... ఆరోగ్య భద్రత హెల్త్ కార్డు లను కూడ ఈ పూజరులకు కల్పించాలని కోరారు.మౌలిక సదుపాయాలు వసతులు కల్పించాలని ప్రభుత్వంను కోరారు.తమను గుర్తించి నిండు అసెంబ్లీలో మా బహుజన పూజారుల శివ సత్తుల గురించి మాట్లాడారని అన్నారు.ఈ కార్యక్రమంలో బహుజన పూజరుల శివసత్తుల సేవాసమితి ఏటూరునాగారం సభ్యులు అందే సుమలత,అమంచ పద్మ,బయ్య సుభద్ర,
బోల్లే కొమురయ్య,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చిటమట రఘు,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు
ఇర్శవడ్ల వెంకన్న,జిల్లా నాయకులు ఎండి ఖలీల్ ఖాన్, జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి ఎండి గౌస్,వావిలాల ఎల్లయ్య,యూత్ అద్యక్షులు వసంత శ్రీనివాస్,చిక్కల్లా మానస తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: