ఐటీడీఏ డిప్యూటీ పి ఓ కు వినతి పత్రం ఇచ్చిన న్యూ డెమోక్రసీ నాయకులు
గుండాల అక్టోబర్ 12 (మన్యం మనుగడ) పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని న్యూ డెమోక్రసీ నాయకులు ఐ టి డి ఎ డిప్యూటీ పిఓ కు వినతిపత్రం ఇచ్చారు. అనంతరం నాయకులు ఈ సం చంద్రయ్య , బోర్ర వెంకన్న , మాట్లాడుతూ. పోడు భూములకు పట్టాలు ఇవ్వక పోవడం వలన ఫారెస్ట్ అధికారులతో తరచూ ఇబ్బందులు గురవుతున్నాఈ అన్నారు. పట్టాలు లేనందున కోపరేటివ్ సొసైటీలో ధాన్యం అమ్మాలన్నా అధికారులు కొనుగోలు చేయటం లేదన్నారు. ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కల్తీ శ్రీను , మామ కన్ను రైతులు పాల్గొన్నారు
Post A Comment: