మన్యం టీవీ కరకగూడెం: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు ఆదేశాల మేరకు టిఆర్ఎస్ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ సంస్కృతి,సాంప్రదాయాలతో బతుకమ్మ సంబరాలు కరకగూడెం మండల కేంద్రంలో ప్రాథమిక సహకార కేంద్రం నందు ఘనంగా నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా కరకగూడెం మండల టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల సోమయ్య, ఎంపీపీ రేగా కాళిక మాట్లాడుతూ తెలంగాణ
సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గత ఏడున్నర ఏండ్లుగా బతుకమ్మ సంబరాలను ఘనంగా జరుపుకుంటున్నాము.మన తెలంగాణ సంస్కృతి,సాంప్రదాయాలను కాపాడుకుంటూ,దసరా పండుగ సందర్భంగా బతుకమ్మ చీరలు చేస్తూ,మహిళలందరూ ఈ బతుకమ్మ పండుగను ఆనందంగా జరుపుకుంటారు.పూలను పూజించే సంస్కృతి మన తెలంగాణది అన్నారు.
తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ సంబరాలు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చాయని,జాగృతి సంస్థ అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేతృత్వంలో ప్రపంచవ్యాప్తంగా బతుకమ్మ వేడుకలు విస్తరించాయన్నారు.
ఈ కార్యక్రమంలో బూర్గంపాడు వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ కొమరం రాంబాబు ఎపిఎం త్రిగుణ,పార్టీ ప్రధాన కార్యదర్శి బుడగం రాము,ఆత్మ కమిటీ డైరెక్టర్ కొంపెళ్ళి పెద్ద రామలింగం,కరకగూడెం మండల టీఆర్ఎస్ పార్టీ నాయకులు,జాడి రామనాథం,అక్కిరెడ్డి వెంకట్ రెడ్డి,మహిళ అధ్యక్షులు కాసు లావణ్య,యువజన నాయకులు గుడ్ల రంజిత్ కుమార్,చిట్టిమల్ల ప్రవీణ్,పూజరి క్రిష్ణ,దాసరి సాంబయ్య కార్యకర్తలు,అభిమానులు, మహిళలు,ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: