మన్యం టీవీ : జూలూరుపాడు, అక్టోబర్ 5, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,.జూలూరుపాడు మండల కేంద్రంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో పోడు రైతులకు మద్దతుగా నిర్వహించిన సడక్ బంద్ ప్రశాంతంగా ముగిసింది. మంగళవారం అఖిలపక్షం నాయకులు రోడ్డు పై బైటాయించి నిరసన తెలిపారు. టిఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్షం వైరా నియోజకవర్గ నాయకురాలు బానోత్ విజయ బాయ్ మాట్లాడుతూ.. రెండో సారి ఎన్నికలలో పోడు రైతులకు పట్టాలు ఇస్తానని హామీ ఇచ్చి ముఖ్యమంత్రి కెసిఆర్ మాట తప్పారని, తెలంగాణ రాష్ట్రంలొ పోడు రైతుల సమస్యలను పరిష్కరించడంలో టిఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని, అన్నారు. ఫారెస్ట్ అధికారులతో దాడులు చేయించి పోడు రైతులపై కేసులు పెడుతున్నారని, గత ప్రభుత్వాలు ఇచ్చిన హక్కు పత్రాలను లెక్క చేయకుండా కేసులు పెడుతున్నారని నిరసన తెలియజేశారు. తక్షణమే టిఆర్ఎస్ ప్రభుత్వం పోడు రైతులకు పట్టాలు ఇవ్వాలని, పోడు రైతులపై పెట్టిన కేసులను బేషరత్తుగా ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.ఏజెన్సీ ప్రాంతంలో స్థానిక ఎమ్మెల్యే లు పోడు రైతులకు మద్దతుగా నిలవాలని అఖిలపక్షం తరపున కోరారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు గుండెపిన్ని వెంకటేశ్వర్లు, చండ్ర నరేంద్రకుమార్, చీమలపాటి బిక్షం, గార్లపాటి వెంకటి, చిలుకూరు కృష్ణయ్య, ఎదులాపురం గోపాల్ రావు, బచ్చల లక్ష్మయ్య, బాణోత్ ధర్మ, చాంద్ పాషా, చింత స్వరాజ్యరావు, నాగుల్ మీరా, బాణోత్ లక్ష్మణ్, సిద్దూ, అచ్చయ్య, కొండ వీరయ్య, పవన్, వివిధ పార్టీల కార్యకర్తలు పాల్గొన్నారు.
Post A Comment: