పాల్వంచ పట్టణానికి చెందిన మొహమ్మద్ అబ్దుల్ ముజాహిద్ ను పాల్వంచ రెవిన్యూ డివిజన్ పరిధి లోని ఎనిమిది 8 మండలాలకు ప్రభుత్వ ఖాజీగా నియమిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా అశ్వారావుపేట, దమ్మపేట, ములకలపల్లి, పినపాక, కర్కగూడెం, అశ్వాపురం, మణుగూరు మరియు బూర్గంపాడు మండలాలకు ఖాజీగా నియమితులయ్యారు. ముజాహిద్ విలేకరులతో మాట్లాడుతూ పైన తెలుపబడిన మండలాలకు చెందిన ముస్లిం ప్రజలు నిఖా (వివాహాలు) లకు సంబందించిన అన్ని వివరాలకు పాల్వంచ లోని స్టేట్ బ్యాంకు రోడ్ లో గల ఖాజీ కార్యాలయాన్నిమరియు 9700251042 ఫోన్ నెంబర్ ను సంప్రదించాలని కోరారు.
Post A Comment: