👉 ముఖ్య అతిధిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ అనుదీప్
మన్యం మీడియా ప్రతినిధి/ములకలపల్లి(అక్టోబర్-07):: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట నియోజకవర్గం, ములకలపల్లి మండలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా నూతన నిర్మించిన రైతు వేదికలు,అంగన్ వాడి కేంద్రాలు,డబల్ బెడ్ రూమ్ ఇళ్ళను స్థానిక అశ్వరవు పేట నియోజకవర్గ శాసన సభ్యులు మెచ్చా నాగేశ్వరావు, జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య సంయుక్తంగా ప్రారంభించారు.మండలంలోని కొమ్ముగూడెం,రాజుపేట, జగన్నాధపురం గ్రామాలలో రైతు వేదికలను, పొగళ్ళపల్లి గ్రామంలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళను, రాజాపురం, నల్లముడి,గుట్టగూడెం గ్రామాలలో అంగన్వాడి కేంద్రాలను అట్టహాసంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా కొమ్ముగూడెం, జగన్నాధపురం గ్రామాల్లో జరిగిన సభలో ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రైతాంగానికి పెద్దపీట వేసిందని, రైతు వేదికల నిర్మాణాల వలన రైతులు సమావేశమై వ్యవసాయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు,ఎరువుల వినియోగం, సస్యరక్షణ చర్యలపై చర్చించి సమిష్టి నిర్ణయాలు తీసుకోవడానికి వేదికగా ఉంటుందని అన్నారు.జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి(ఐఏఎస్) ఈ కార్యక్రమంలో పాల్గోని మాట్లాడుతూ రైతువేదిక నిర్మాణం ఒక అద్భుతం అని అన్నారు. ఈ కార్యక్రమంలో ములకలపల్లి ఎంపీపీ మట్ల నాగమణి,ములకలపల్లి జడ్పీటీసీ సున్నం నాగమణి,దమ్మపేట జడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు,ఎంపిటిసిలు,ఆయా గ్రామ పంచాయితీ సర్పంచులు,టిఆర్ఎస్ పార్టీ ములకలపల్లి మండల అధ్యక్షుడు మోరాంపూడి అప్పారావు,టిఆర్ఎస్ పార్టీ నాయకులు బత్తుల అంజిబాబు,పామర్తి వెంకటేశ్వరరావు,ఇనుగంటి రాము,తాటి ప్రవీణ్,ప్రకాష్, ఆయా గ్రామమండలంలోని అన్ని శాఖల అధికారులు,కార్యకర్తలు, అభిమానులు,ఆయా గ్రామాల గ్రామస్తులు,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: