CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

చట్టాలు లేక్కచేయని అక్రమార్కులు.. గిరిజన భూముల ఆక్రమణ

Share it:

 



పుష్కలంగా అధికారుల అండదండా


గిరిజనులపై అక్రమ కేసులు భనాయించడం


పేసా చట్టాన్ని పాతరేశారు


ఆదివాసీలకు భూములపై హక్కులనిచ్చే చట్టాలను భూస్థాపితం చేశారు


వేల ఏకరాల అమాయికుల భూములను దోపిడీ చేసి అక్రమణ జెండాలను పాతేస్తున్నారు


 అదివాసీల భూములను, అస్తులను మింగేస్తున్నా రాబందులేవరు..?


 మన్యంటీవి, అశ్వారావుపేట: అశ్వారావుపేట మండల ఎజన్సీలో అక్రమార్కుల దోపిడికి అడ్డుఅదుపు లేకుండా పోతుంది. ఎజన్సీ ప్రాంతంలో గిరిజనుల ఆస్తులను భూములను పరిరక్షించడానికి ప్రత్యేక చట్టాలు ఉన్నాయి. కాని ఆ చట్టాలను ఉల్లంఘిస్తూ కొందరు బరితెగించి గిరిజనుల భూములను కాజేస్తున్నారు. ప్రధానంగా గిరిజనుల హక్కులను రక్షించడానికి ఎజన్సీ ప్రాంతంలో 1/70 యాక్ట్, పీసా యాక్ట్ లు ఉన్నాయి. 1/70 యాక్ట్ ప్రకారం ఎజెన్సీ ప్రాంతంలో గిరిజనేతరులు భూములు కోనుగోలు చేయరాదు. ‌కొనుగోలు చేసినా ఆ భూములపై హక్కులు లభించవు. అదేవిధంగా గిరిజన ప్రాంతాలలో ఏ పని చేయాలన్నా గిరిజన గ్రామాల తీర్మానం తప్పనిసరి. గిరిజనుల గ్రామసభ తీర్మానాలు లేకుండా ఏలాంటి పనులు చేపట్టరాదని చట్టాలు చెబుతున్నాయి. కానీ భద్రాద్రి కొత్తగూడెం అశ్వారావుపేట మండల ఎజన్సీ ప్రాంతంలో 1/70 యాక్టు ఉల్లంఘనలు జరుగుతున్నాయి. గిరిజన భూములను కొందరు అక్రమార్కులు అడ్టగోలుగా భూ ఆక్రమణకు పాల్పడుతున్నారు. అశ్వారావుపేట మండలంలో భూబకాసురులు ఏకంగా వందల ఏకరాలను కబ్జా చేసి పట్టాలు చేయించుకోవడం విశేషం. ఈ భూముల విలువ కనీసం వంద కోట్లకు పైగా ఉంటుంది‌. అశ్వారావుపేట, మండల ప్రాంతాల్లో మొత్తం వేల ఎకరాల భూములను అక్రమార్కులు తమ నుంచి అక్రమించుకున్నారని గిరిజనులు అరోపిస్తున్నారు. అయితే భూములు కబ్జాలు కావడానికి అనేక కారణాలు ఉన్నాయి. వాటిలో ప్రధానం గిరిజనుల అమాయకత్వం. వారి అమాయకత్వాన్ని అసరాగా చేసుకొని పెళ్లికి, పంటకు అప్పులు ఇచ్చి ఆ అప్పుల కోసం భూములను లాక్కుకుంటున్నారు. మరికొందరు భూస్వాములు బరితెగించి గిరిజనుల భూములపై జెండాలు పాతేస్తున్నారు. పైగా అక్రమించిన భూములకు నిబంధనలు అడ్డు రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. 1/70 యాక్ట్ 1970లో వస్తే ఆ చట్టం రాకముందు భూములు కొనుగోలు చేసినట్లుగా తప్పుడు రికార్డులు సృష్టించి కబ్జాలకు పాల్పడుతున్నారు. ఎవరైనా అక్రమార్కులను ప్రశ్నిస్తే వారిపై పోలీసు కేసులు నమోదు చేస్తున్నారు. దాంతో తమకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకోవడానికి గిరిజనులు భయపడుతున్నారు. అయితే పంటపోలాలను మింగిన రాకాసులు నివాస స్థలాల జోలికి పోవడం లేదు. అంతే కాకుండా ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనేతరులు నివాస స్థలాలు కొనుగోలు చేయడం చట్ట విరుద్ధం. కానీ ఇక్కడ భారీ వాణిజ్య సముదాయాలు సైతం ‌నిర్మిస్తున్నారు‌. బహుళ అంతస్తుల భవనాలు నిర్మించడం నిబంధనలకు వ్యతిరేకం. కాని ఏకంగా బహుళ అంతస్తు భారీ భవనాలు నిర్మిస్తున్నారు. కొందరు వడ్డీ వ్యాపారులు వందల భవనాలు అనుమతులు లేకుండా నిర్మిస్తున్నారు. అయినప్పటికీ అదికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఎజన్సీ ప్రాంతంలో గిరిజన హక్కులను దోపిడీదార్లు కాలరాస్తున్నాయి. ఈ దోపిడీ దారుల వల్ల భూముల ధరలు అమాంతంగా పెరిగిపోతున్నాయి. దీనికి కారణమైన దోపిడిదారులపై చర్యలు తీసుకోవాలని గిరిజనులు కోరుతున్నారు. కానీ అధికారులే కబ్జా దారులకు కొమ్ముకాయడం విశేషం, ఇకనైనా జిల్లాస్థాయి అధికారులు జోక్యం చేసుకొని గిరిజనులకి జరుగుతున్న అన్యాయాన్ని, మరియు అక్రమార్కులకి వెన్నంటే ఉంది సహాయ సదుపాయాలను అందిచే అధికారుల కఠిన శిక్ష విధించాలని గిరిజనులు మరియు గిరిజన సంఘాలు మీడియా ముఖంగా చేతులెత్తి మొక్కుతూ విన్నవిస్తున్నట్లు తెలియజేసారు.

Share it:

Post A Comment: