మాన్యం టివి:ములకలపల్లి మండలం;పావని అనే రజక బిడ్డ ను రేప్ చేసి హత్య చేసిన హాంతకుడిని ఎన్ కౌటర్ చేయాలని మండలంలోని మాదారం గ్రామం సెంటర్ లో రజక వృత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు ముదిగొండ రాంబాబు పాల్గొని మాట్లాడుతూ,విశాఖపట్నం గాజువాక కు చెందిన పావని ని(14)సం.లు అతి కిరాతకంగా హత్య గావించిన నిందితుని పోలీసులు వెంటనే అరెస్టు చేసి శిక్షించాలని'భవిష్యత్తులో రజక కుటుంబాలకు ఇటువంటి దుస్థితి ఏర్పడకుండా ప్రత్యేక రక్షణ చట్టం కావాలని,రజకులకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ముదిగొండ కృష్ణ, ధర్మరాజుల సాంబ,ఈ లీలావతి,శ్రావ్య, భాను,నందిని,వందన కందుకూర్,రవి తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: