మన్యం టీవి, అశ్వరావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం, జమ్మిగూడెం గ్రామంలో దేవి నవరాత్రుల సందర్భంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. 11 రోజులు నిర్వహించే దేవీనవరాత్రులను ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రతి రోజు పూజలు నిర్వహిస్తూ సాయంత్రం సమయంలో బతుకమ్మ ఆటలు ఆడుతూ, ఈ రోజు దసరా సందర్భంగా అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించుకొని 17వ తారీఖు అనగా ఆదివారం రోజు అమ్మవారి నిమజ్జనానికి తీసుకెళ్లడం జరుగుతుందని కమిటీ సభ్యులు తెలిపారు. ఈ యొక్క అన్నసంతర్పణ కార్యక్రమానికి జమ్మి గూడెం గ్రామ పంచాయతీ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Navigation
Post A Comment: