రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుక వెళ్ళండి:విప్ రేగా కాంతారావు
పినపాక నియోజకవర్గ అన్ని మండలాల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మరియు ప్రధాన కార్యదర్శుల తో విప్ రేగా కాంతారావు ప్రత్యేక సమావేశం
మన్యం టీవి,మణుగూరు:రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుక వెళ్ళాలి అని విప్ ,పినపాక శాశన సభ్యులు రేగా కాంతారావు అన్నారు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం,ఇల్లందు సింగరేణి గెస్ట్ హౌస్ లో ఇటీవల నూతనంగా నియామకమైన పినపాక నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ అన్ని మండల అధ్యక్షులు మరియు ప్రధాన కార్యదర్శుల తో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు ప్రత్యేక సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు కల్వకుంట్ల.చంద్రశేఖర రావు అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని కోరారు.ముఖ్యమంత్రి కెసిఆర్ అమలు చేస్తున్న,సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు దేశంలోని ఆదర్శంగా నిలిచాయఅన్నారు.టిఆర్ఎస్ పాలనలో కనివిని ఎరుగని స్థాయిలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయన్నారు.కార్యకర్తలు,నాయకులు,సమిష్టిగా పనిచేసి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను అందే విధంగా కృషి చేయాలన్నారు.పేద ఆడబిడ్డలకు కళ్యాణాలక్మి పధకం ద్వారా రూ.1లక్ష 116 రూపాయలను అందించడం జరుగుతుందన్నారు.వృద్ధులకు,ఒంటరి మహిళలకు,ఆసరా పథకం ద్వారా అండగా ధైర్యంగా,సీఎం కేసీఆర్ని లుస్తున్నారన్నారు అని తెలిపారు.ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పొశం.నర్సింహారావు, పినపాక నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ అన్ని మండలాల అధ్యక్షులు,పట్టణ అధ్యక్షులు,ప్రధాన కార్యదర్శులు,పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: