CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

లక్ష్మీ దేవి అవతారం లో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు

Share it:


అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన స్థానిక ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి,తాసిల్దార్ కుసుమ రవీందర్.

మన్యం టీవీ ఏటూరు నాగారం

దేవి నవరాత్రి ఉత్సావాలలో భాగంగా ఈ రోజు 5వ రోజు అమ్మవారు లక్ష్మీదేవి అవతారంలో సాయిబాబా దేవాలయ ఆవరణలో భక్తులకు దర్శనం యిచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా అమ్మవారిని 8లక్షల ఒక వెయ్యి 216 రూపాయలతో అమ్మవారిని కమిటీ సభ్యులు సుందరంగా అలంకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ఏటూరునాగారం మండల రెవిన్యూ అధికారి రవీందర్,సబ్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ రెడ్డి హాజరై అమ్మవారికి పూజ కార్యక్రమాలు నిర్వహించారు.అర్చకులు ఎల్లాప్రగడ మణికంఠ శర్మ ఆధ్వర్యంలో పూజ నిర్వహించారు.అనంతరం కమిటీ సభ్యులు ముఖ్య అతిథులను శాలువాలతో సత్కరించారు.సాయంత్రం అమ్మవారికి 108 రకాల నైవైద్యాలు సమర్పించారు.ఈ కార్యక్రమంలో దేవాలయ చైర్మన్ చెన్న ముత్తయ్య,వైస్ చైర్మన్ గాడిచర్ల కృష్ణ, కార్యదర్శి పెండ్యాల ప్రభాకర్,కోశాధికారి చిందుకూరి వెంకట్రావు మరియు సభ్యులు మాదరి తిరుపతి,కప్ప సుశీల మరియు మహిళలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Share it:

Post A Comment: