CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలి

Share it:


మన్యం టీవీ ఏటూరు నాగారం

చట్టాలపై మహిళలు అవగాహన పెంచుకోవాలని నేరాల పై అవగాహన లేకపోవడం వల్లనే రోజు రోజుకు  సమాజంలో మహిళలు వివక్షతకు గురి అవుతున్నారని ములుగు సీనియర్ అడ్వకేట్ లు బజారు శ్యాం ప్రసాద్ భానోత్,స్వామి దాసు సత్యనారాయణ అన్నారు.మండల కేంద్రంలోని స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో సర్పంచ్ ఈ సం రామ్మూర్తి అధ్యక్షతన నేషనల్ లీగల్ అథారిటీ సర్వీస్ ఆధ్వర్యంలో మహిళలకు చట్టాలపై అవగాహన కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో మహిళలకు స్వేచ్ఛ దూరం చేశారని మహిళా భాగస్వామ్యం సమాజంలో చాలా ప్రధానమైనది అని స్త్రీ పురుషుల సమానత్వం కోసం చట్టాలపై మహిళలు పూర్తి అవగాహన పెంచుకోవాలని అన్నారు.మహిళలు విద్యలో రాణించాలని నేరాల పై అవగాహన లేకపోవడం వల్లనే మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని మైనర్ బాలికలపై జరుగుతున్న లైంగిక నేరాలను నియంత్రించడానికి పోక్సో చట్టం యాక్ట్ 376 ప్రకారం 14 సంవత్సరాల జీవిత శిక్ష పడుతుందని నేరాలను నియంత్రించడానికి ఏర్పాటు చేసిన చట్టం పై పోక్సో చట్టం అన్నారు.సఖి సెంటర్ 100 డైల్ పై ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా అవగాహన పెంచుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ములుగు జడ్పీ కోఆప్షన్ సభ్యుల వాలియబి సలీం,గ్రామ పంచాయతీ కార్యదర్శి రఫీ,అంగన్వాడీ కార్యకర్తలు మహిళా సంఘాలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: