👉ఇటీవలే సింగరేణి అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసిన విప్ రేగా
👉అభివృద్ధి పనులకు సీఎస్ ఆర్ నిధి నుండి రూ.2 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసిన మణుగూరు సింగరేణి యాజమాన్యం
మన్యం టీవీ, మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం, అంబేద్కర్ సెంటర్ నుండి బాంబే కాలనీ వెళ్లే రహదారి విస్తరణకు,సెంట్రల్ లైటింగ్,కు రూ.2 కోట్ల రూపాయల నిధులు మంజూరు అయ్యాయని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు తెలిపారు.ఈ సందర్భంగా పినపాక నియోజకవర్గ అభివృద్ధి కి కట్టుబడి ఉన్నామని,ప్రజల సంక్షేమమే లక్ష్యం గా పని చేస్తానని విప్ రేగా తెలిపారు. విప్ రేగా మార్క్ పరిపాలన కు మండల ప్రజలు ఎప్పటికి రుణపడి ఉంటామని, మణుగూరు పై ప్రత్యేక కార్యచరణ తో నిధులు సాధిస్తూ,విప్ రేగా చేసే అభివృద్ధి కార్యక్రమాల ను చూసి ప్రజలు అభినందలను తెలుపుతున్నారు.
Post A Comment: