CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పంజాబ్ నేషనల్ బ్యాంకు లో ఫీల్డ్ ఆఫీసర్ నియమించాలి

Share it:

 


మన్యం టీవీ ఏటూరు నాగారం

ములుగు జిల్లా కన్నాయిగూడెం మండల కేంద్రంలో మంగళవారం విలేకరుల సమావేశంలో కన్నాయిగూడెం మండల వైస్ ఎంపీపీ బొల్లె భాస్కర్ మాట్లాడుతూ కన్నాయిగూడెం పంజాబ్ నేషనల్ బ్యాంకు లో ఫీల్డ్ ఆఫీసర్ లేకపోవడం వల్ల రైతులకు రుణాలు ఇవ్వక పోవడం వల్ల కన్నాయిగూడెంలోని రైతులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని,బ్యాంకు శాఖ వారు ఫీల్డ్ ఆఫీసర్ ను త్వరగా నియమించాలని, అన్నారు.యాభై వేల రూపాయలు రుణ మాపి ఇంకా కాలేదని రుణ మాపి అయినా రైతులా లిస్ట్ ను విడుదల చేయాలని అదేవిధంగా పంజాబ్ నేషనల్ బ్యాంకును కన్నాయిగూడెం మండల కేంద్రంలో ఉండే విదంగా బ్యాంకు శాఖ వారు బాధ్యత తీసుకోవాలని అన్నారు. తుపాకులగూడెం నుండి ఏటూరునాగారం 40 కిలోమీటర్ల దూరంగా ఉండడం వల్ల ప్రజలు,రైతులు ఒక్క రోజు పని కోల్పోవడం జరుగుతుందని,ఒక్కొక్కసారి బ్యాంకు పని మీద వచ్చి ఒక్క రైతుకు 3రోజులు పడుతుందని కన్నాయిగూడెం మండల కేంద్రానికి కేటాయించిన పంజాబ్ నేషనల్ బ్యాంకును కన్నాయిగూడెం మండల కేంద్రంలో ఉంటె మండల ప్రజలకు రోజు వారి పనులకు ఇబ్బందులు ఉండవని ప్రభుత్వ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నమని లేని పక్షంలో ధర్నాలు,రాస్తారోకోలు చేస్తామని డిమాండ్ చేస్తున్నామని అన్నారు.

Share it:

Post A Comment: