మన్యం టివి, దుమ్ముగూడెం: రామచంద్రుని పేట గ్రామంలో కన్న తల్లి అయిన కల్లూరి పగడమ్మ ను త్రాగుడు కోసం డబ్బులు ఇవ్వలేదనే నెపంతో కన్న కొడుకు అయిన కల్లూరి నర్సింహారావు వయస్సు రోకలి కర్రతో కొట్టి చంపి ఆమె వద్ద గల డబ్బులు,బంగారపు కాసులు దొంగిలించి కొని పోయిన నర్సింహారావు పై నిన్న దుమ్ముగూడెం పోలీస్ వారు కేసు నమోదు చేయగా భద్రాచలం టౌన్ సి ఐ టీ .స్వామి కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. పరారీలో వున్న ముద్దాయి నర్సింహారావు గురించి పథకం ప్రకారం రామచంద్రుని పేట మరియు చుట్టుపక్కల గ్రామాల్లో సి ఐ స్వామీ ,ఎస్ ఐరవికుమార్ మరియు సిబ్బంది కలిసి గాలిస్తూ వుండగా శనివారం ఉదయం 11 గంటల సమయంలో రామచంద్రుని పేట గ్రామంలో నర్సింహారావు వాళ్ళ ఇంటి సమీపంలో సంచరిస్తున్నాడనే సమాచారం తో గాలించగా పట్టుబడ్డాడు. నిందితుడిని విచారించగా తన కన్న తల్లి పగడమ్మను త్రాగుడు కోసం డబ్బులు అడగ్గా వుండి కూడా లేవని అన్నదని దాంతో కోపం తో అవసరమైతే చంపి డబ్బులు తీసుకెళ్లాలని పథకం వేసుకొని పగడమ్మ తో గొడవ పడి పక్కనే వున్న రోకలి కర్రతో కొట్టి చంపి డబ్బులు మరియు మెడలో వున్న బంగారం దొంగిలించి నట్లు గా అంగీకరించినట్లు సిఐ తెలిపారు. నిందితుని వద్ద నుండి కొంత నగదు , మరియు బంగారపు దండ బిళ్ళలు - 6 స్వాధీనం చేసుకొని నర్సింహారావు ని అదుపులోకి తీసుకొని రిమాండ్ కి తరలించినట్లు సిఐ తెలిపారు.
Post A Comment: