గుండాల అక్టోబర్ 10 (మన్యం మనుగడ) మండలంలో వైఎస్ఆర్ టి పి పార్టీలో చేరికలు ప్రారంభమయ్యాయి. పార్టీ మండల కన్వీనర్ తవి డ్డీ శెట్టి రాంబాబు ఆధ్వర్యంలో పార్టీలో చేరే వారికి కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సమావేశానికి పినపాక నియోజకవర్గ కన్వీనర్ తాటి పత్రి సుధారాణి, మహబూబాబాద్ పార్లమెంట్ కమిటీ సభ్యులు ప్రదీప్ కుమార్ , ఆళ్లపల్లి మండల కన్వీనర్ కరక పల్లి సుధాకర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ. రానున్న రోజుల్లో పార్టీలో పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని వారు అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రానున్న రోజుల్లో పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మోహన్ రావు, శ్రీధర్, సంపత్ , చంటి, బుజ్జి బాబు, తదితరులు పాల్గొన్నారు
Post A Comment: