గుండాల ఆళ్ల పల్లి అక్టోబర్ 5 (మన్యం మనుగడ) ఆళ్ల పల్లి మండల కేంద్రంలో సడక్ బంద్ విజయవంతంగా ముగిసింది, న్యూ డెమోక్రసీ , సిపిఐ, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సడక్ బంద్ విజయవంతం చేశారు. మండల కేంద్రంలోని ప్రధాన కూడలి వద్ద రోడ్డుపై బైఠాయించి వాహనాలు రాకపోకలు సాగకుండా రోడ్లను దిగ్బంధనం చేశారు. పోడు భూముల పరిరక్షణ కై చేపట్టిన బంద్ ను అఖిలపక్షం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిర్వహించడం ఆనందంగా ఉందని అఖిలపక్ష నాయకులు పేర్కొన్నారు. పోడు భూములకు పట్టాలు ఇచ్చేంత వరకు ఉద్యమాలు చేస్తూనే ఉంటామని అఖిలపక్ష నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు రేసు ఎల్లయ్య , గోగేల కృష్ణయ్య , కాంగ్రెస్ నాయకులు రామ నరసయ్య , న్యూ డెమోక్రసీ నాయకులు బట్టు ప్రసాద్, సర్పంచులు కోటేశ్వరరావు, సమ్మక్క , ఈశ్వరి, కో ఆప్షన్ సభ్యులు ఎస్కే రహీం, కొమరం సత్యనారాయణ, బత్తిని సత్యం, తులం ముత్తి లింగం, తదితరులు పాల్గొన్నారు
Post A Comment: