👉 తాజా, మాజీ వర్గీయుల బాహాబాహి..
👉 పోలీస్ లాఠీ చార్జ్..
మన్యం టీవీ : జూలూరుపాడు, అక్టోబర్ 14, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండల కేంద్రంలో సద్దుల బతుకమ్మ సంబురాల్లో స్థానిక ఎమ్మెల్యే రాములు నాయక్, మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణ జరుగుతున్న క్రమంలో స్థానిక పోలీసులు ఇరువర్గాలను ఆపే ప్రయత్నం చెయ్యగా, ఎవరు మాట వినకపోవడంతో గుంపులను చెదరగొట్టేందుకు లాఠీలకు పని చెప్పారు. దీంతో మండల కేంద్రంలోని ప్రధాన సెంటర్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టిఆర్ఎస్ పార్టీలో అంతర్గతంగా ఉన్న వర్గ విభేదాలు భగ్గుమని బాహాబాహీకి దిగడంతో ఈ సంఘటన మండల వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
Post A Comment: