👉 వాలీబాల్ టోర్నమెంట్ నిర్వాహక కమిటీ వారికి 5116/- రూపాయలు అందజేత
మన్యం మీడియా ప్రతినిధి/దమ్మపేట:: రాచురుపల్లి గ్రామంలో గిరిజన యువకుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వాలీబాల్ టోర్నమెంట్ గ్రామస్థాయి పోటీలకు వైయస్సార్ టిపి ఉమ్మడి ఖమ్మం జిల్లా కో కన్వీనర్ సోయం వీరభద్రం ముఖ్య అతిథిగా హాజరై గిరిజన క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. గిరిజన క్రీడాకారులను ప్రోత్సహించేందుకు, వీరభద్రం తండ్రిగారైన సోయం వెంకటేశ్వర్లు జ్ఞాపకార్థం 5116/- రూపాయలను కమిటీ వారికి అందజేశారు.ఈ సందర్భంగా సోయం వీరభద్రం మాట్లాడుతూ గిరిజన గ్రామాల్లో ఇటువంటి క్రీడా కార్యక్రమాలు నిర్వహించడం వలన యువకుల్లో మానసిక ఉల్లాసం, క్రీడా నైపుణ్య ప్రతిభ మెరుగుపడుతుందని. గిరిజన యువకులు విద్యతో పాటు క్రీడల్లో తమ ప్రతిభ చాటాలని, అందుకు ఆదివాసీ నాయకులు అందరూ కృషి చేయాలని అన్నారు.ఈ వాలీబాల్ టోర్నమెంట్ కార్యక్రమంలో వీరభద్రం వెంట తాటి సూరిబాబు,కె ధనుంజయరావు,కొర్సా వెంకటేశ్వరరావు, త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: