CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పెంచిన పీఆర్సీ వేతనం ఇవ్వాలని బూర్గంపహాడ్ లో లోసీడీపిఓ కి వినతిపత్రం సమర్పించారు

Share it:

 



మన్యం టీవీ,(బూర్గంపహాడ్)మణుగూరు: తెలంగాణ ప్రభుత్వం అంగన్వాడీ టీచర్స్ హెల్పేర్స్ కు పెంచిన 30 శాతం పీఆర్సీ అమలు చేసి వేతనాలు ఇవ్వాలి అని కోరుతూ,రాష్ట్ర మొత్తం జరుగుతున్న నిరసన కార్యక్రమంలో భాగంగా బూర్గంపహాడ్ ప్రాజెక్టు లో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో వినతిపత్రం ను ఏసీడీపీఓ కు అందించారు.ఈ సందర్భంగా ఏఐటీయూసీ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వం ఉద్యగులకు ఇచ్చిన విధంగా పీఆర్సీ 30 శాతం అమలు చేస్తామని హామీ ఇచ్చి జిఓ ఇచ్చినా,జులై నెల నుంచి నేటి వరకు ఇవ్వలేదు అని అన్నారు.దసరా పండుగ సందర్భంగా నూతన వేతనాలు వస్తాయి అని ఎదురుచూస్తున్న తెలంగాణ ఆడ పడుచులను, నిరాశ పరిచిన సీఎం కేసీఆర్ తక్షణమే పెరిగిన వేతనాలు అమలు చేయాలని,లేని పక్షంలో ఉద్యమం చేస్తాం అని అన్నారు.ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు వెంకటరమణ మాలతి శ్రీదేవి రచన తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: