CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పనిలో సమన్వయం, ఏకాగ్రత,నిశిత పరిశీలన తో ప్రమాదాలు నివారించండి: బేస్ వర్క్ షాప్ ఇంజనీర్ దాసరి.రాజశేఖర్

Share it:



మన్యం టీవీ మణుగూరు:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు సింగరేణిలో భారీ యంత్రాలైన బుల్ డోజర్లు మరమ్మతు నిర్వహించేటప్పుడు సంబంధిత ఫిట్టర్లు వారి సహాయకులు క్రేన్ ఆపరేటర్ లు  సమన్వయంతో పనిలో ఏకాగ్రత నిశిత పరిశీలనతో ప్రమాదాలు నివారించవచ్చని, బేస్ వర్క్ షాప్ ఇంచార్జ్ దాసరి. రాజశేఖర్ అన్నారు.సింగరేణి వ్యాప్తంగా యాజమాన్యం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రక్షణ కార్మికుల బాధ్యత సేఫ్ ఆపరేషన్ ప్రొసీజర్ కార్మికుల అవగాహన కార్యక్రమంలో భాగంగా పీకే ఓసి రక్షణ విభాగం ఆధ్వర్యంలో సోమవారం ఉదయం ఓసి- 2 డోజర్ సెక్షన్ లో ఎస్ ఓ పి కార్యక్రమం జరిగింది.బేస్ వర్క్ షాప్ ఇంచార్జ్ దాసరి.రాజశేఖర్ ఎస్ ఈ,ఈఎం ముఖ్యఅతిథిగా పాల్గొని కార్మికులలో రక్షణ పట్ల అవగాహన కలిగించారు.డోజర్ సెక్షన్ ఫిట్టర్ కమ్ సీనియర్ మెకానిక్ వై.రాంబాబు ఎస్ ఓ పి చదివి వినిపించారు. అనంతరం కార్మికులందరూ సంయుక్తంగా రక్షణ ప్రతిజ్ఞ చేశారు.ఈ కార్యక్రమంలో డోజర్ సెక్షన్ ఇంచార్జ్ ఇంజనీర్ అభిషేక్ గుర్తింపు సంఘం నాయకులు సిహెచ్ అశోక్,ఎస్ ఓ పి సమన్వయ కర్త నాసర్ పాషా,పిట్ సేఫ్టీ కమిటీ సభ్యులు కిషన్ కార్మికులు రమేష్ ,కె వెంకటేశ్వర్లు,కే వి రమణ అహమ్మద్ హుస్సేన్, అనిల్ కుమార్, షేక్ ఇమామ్, విజయ్ రాజ్ ,క్రేన్ ఆపరేటర్ అత్తులూరి రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: