మాన్యం టీవీ:ములకలపల్లి మండలం: గతంలో ప్రభుత్వ భూమిని ఆక్రమించి, గిరిజనులపై అక్రమ కేసులు పెడుతున్న sk సమీర్ పై చర్యలు తీసుకోవాలని,అక్రమంగా ఎటువంటి అనుమతులు లేకుండా కోళ్లపారాలు నిర్మించిన వారిపై,ప్రభుత్వ భూమిని ఆక్రమించిన వారిపై వెంటనే చర్య తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఇచ్చిన ఫిర్యాదు పై చర్యలు తీసుకోవాలని,ఎల్టీ ఆర్ కేసులు ఉన్నా, గిరిజనులపై పోలీస్ అక్రమ కేసులు పెట్టి వేధింపులు ఆపాలని లేకుంటే గిరిజన సంఘాలు అన్ని కలిసి పెద్దఎత్తున ఉద్యమం చెయ్యాల్సివస్తుందని,ఆదిమజాతి ఆదివాసీ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు సోయం సత్యనారాయణ హెచ్చరించారు. పిర్యాదు చేసి నెల రోజులు గడుస్తున్నా రెవిన్యూ సిబ్బంది ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని వెంటనే ప్రభుత్వ భూమిని ఆక్రమించి కౌలు కు ఇచ్చిన వారిపై చర్య తీసుకోవాలని తహసిల్దార్ ని కోరడం జరిగింది.వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో గిరిజన నాయకులు సున్నం వెంకటేశ్వర్లు,కన్నెబొయిన వెంకట నర్సయ్య,సోయం చిన్నారి,ఊకే ముత్తెశ్వరరావు,కుంజా రాజులు,తాటి ప్రసాద్,సున్నం రామకృష్ణ,మనోజ్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: