👉ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు. గజ్జల సందీప్
మాన్యం టివి:ములకలపల్లిమండలం: అక్టోబర్ 25 నుండి జరిగే ఇంటర్మీడియట్ పరీక్షలు రద్దు చేయాలని ఏఐఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తున్నాం,అసలు చదువులే చెప్పకుండా పరీక్షలు ఎలా నిర్వహిస్తారని మేము ప్రశ్నిస్తున్నాము.ఒకపక్క లెక్చరర్లని నియమించలేదు,ఉన్నటువంటి గెస్ట్ ఫ్యాకల్టీ ని కూడా తొలగించారు,మరి సిలబస్ ఎలా పూర్తి చేసారు,సిలబస్ పూర్తి అవకుండా విద్యార్థులు పరీక్షలకు ఎలా సన్నద్ధమవుతారని,కార్పొరేట్ కళాశాలలో ఆన్లైన్ క్లాసులు నిర్వహించారు ఓకే మరి ప్రభుత్వ కళాశాలల పరిస్థితి ఏంటి, గురుకు లాల పరిస్థితి ఏంటని,ప్రభుత్వ కళాశాలల్లో చేరిన విద్యార్థులు వారి తల్లి తండ్రులు ఆవేదన చెందుతున్నారు. కావున ప్రభుత్వం పునరాలోచించి ప్రస్తుతం పరీక్షలను రద్దు చేసి సిలబస్ పూర్తయిన తర్వాతనే పరీక్షలు నిర్వహించాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
Post A Comment: