CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

జూలూరుపాడు మండల కేంద్రంలో పట్టపగలు నగలు దుకాణంలో చోరీ..

Share it:

 



👉 స్థానిక పోలీసులను ఆశ్రయించిన నగల వ్యాపారి.. 



మన్యం టీవీ : జూలూరుపాడు, అక్టోబర్ 1, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండల కేంద్రం నడిబొడ్డున శుక్రవారం మిట్టమధ్యాహ్నం, పట్టపగలు సాయి వెంకటేశ్వర జ్యూయలర్స్ నగలు దుకాణంలో దొంగతనం జరిగింది. నిత్యం ప్రజలతో రద్ధిగా వుండే జూలూరుపాడు మెయిన్ సెంటర్ లో గుర్తు తెలియని వ్యక్తి చాకచక్యంగా నగల దుకాణంలోకి చొరబడి సుమారు 4 లక్షల విలువ గల బంగారు ఉంగరాలు, జుమ్కాలు ఉన్న రెండు బాక్సులు దొంగిలించ బడ్డాయి. షాపు యజమాని నివాసం పక్కనే ఉండడంతో భోజనం చేయడానికి వెళ్లిన సమయంలో ఈ చోరీ జరిగినట్లు తెలుస్తోంది. విషయం గమనించిన షాప్ యజమాని వెంటనే స్థానిక పోలీసులను ఆశ్రయించాడు. వెంటనే స్పందించిన ఎస్సై శ్రీకాంత్ తన బృదంతో దర్యాప్తు చేపట్టారు.

Share it:

Post A Comment: