CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

సామాజిక బాధ్యత కు మరో పేరు "జేడీ ఫౌండేషన్...

Share it:

 



భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం నిన్న గోదావరి నది పాత బ్రిడ్జి పై రైలింగ్ దెబ్బతిన్న ప్రదేశం లో ప్రమాద సూచిక బోర్డును ఏర్పాటు చేసి , ఇక్కడ ప్రమాదం పొంచి ఉన్న విషయాన్ని ,రెయిలింగ్ రిపేర్ చేయవలసిందిగా కోరుతూ నేషనల్ హైవే డి.ఈ కి వినతి పత్రం అందించిన విషయం తెలిసిందే, అక్కడితో ఆగిపోకుండా ఈరోజు జెడి ఫౌండేషన్ సభ్యులు భాద్యత తీసుకొని దెబ్బతిన్న రైలింగ్ ప్రదేశంలో బైండింగ్ వైరు తో తాడు లా కట్టి దాని మీద రెడ్ కలర్ స్టిక్కర్లు అంటించడం జరిగింది, అలాగే హెచ్చరిక బోర్డు చుట్టూ కూడా రాత్రి వేళల్లో కనిపించే లా రేడియం స్టిక్కర్ లు బోర్డర్ లా అతికించారు, ఎవరో వస్తారు ఏదో చేస్తారని ఎదురు చూడకుండా ప్రజల బాధ్యతలు తీసుకున్న జే.డీ ఫౌండేషన్ ని పలువురు అభినందించారు... ఈ సందర్భంగా ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ గా వుండి కూడా బాధ్యతగా ఈ కార్యక్రమానికి సహకరించిన సహకరించిన శ్రీమతి హన్సి పవన్, శ్రీ ఉప్పాడ రాంప్రసాద్ రెడ్డి, శ్రీ కడాలి నాగరాజు,శ్రీ యూసుఫ్ మియా, శ్రీ వేణు లను జే.డీ పౌండేషన్ బాధ్యుడు మురళి మోహన్ కుమార్ అభినందించారు...

Share it:

Post A Comment: