చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి: యాసంగి లో పంట మార్పిడి చేయాలని, వరి పంటకు బదులుగా వేరుశనగ, నువ్వులు, పెసర్లు, జొన్నలు, కూరగాయలు, ఇతర పంటలను వేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి నవీన్ బాబు రైతులకు సూచించారు.మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... యాసంగి పంట ను ఖచ్చితంగా పంట మార్పిడి జరగాలన్నారు.అపరాలు, చిరుధాన్యాలు పండితే రైతులకు మంచి లాభాలు వస్తాయి అన్నారు.మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటల వైపు ఆరుతడి పంటలను, నీటి తక్కువ తో పండించే పంటల వైపు రైతులు మొగ్గుచూపాలి అన్నారు.పొద్దుతిరుగుడు పంటను సైతం వేస్తే మంచి లాభాలు వస్తాయి.నల్లరేగడి నేలలో పెసర్లు,మినుములు వేసుకోవచ్చుఅన్నారు. ఈ కార్యక్రమంలో ఏ ఈ ఓ లు శ్రీకన్య,సాయిబాను, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: