మన్యం టీవీ, అశ్వాపురం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం అమ్మగారి పెల్లి కుమ్మరి గూడెం రెవెన్యూ పరిధిలో నిర్మిస్తున్న సీతమ్మ సాగర్ ప్రాజెక్టు లొ భూములు కోల్పోయిన రైతులకు ఎకరాకు 25లక్షల రూపాయలు హైడల్ విద్యుత్ ప్రాజెక్టు లొ ఉద్యోగాలు కల్పించాలని 104రోజు నిరాహారదీక్షలు కొనసాగిస్తున్న రైతులకు సంఘీభావం తెలిపన టి డి పి నియోజకవర్గ ఇన్చార్జి వట్టంనారాయణదొర మాట్లాడుతూ మీన్యాయమైన డిమాండ్ లు ప్రభుత్వం పరిష్కరించే వరకు మీకు అండగా ఉంటాం అని స్థానిక ఎమ్మెల్యే రేగాకాంతారావు రైతులు 104రోజుల నుంచి నిరిహరదీక్షలు చేస్తుంటే ఈరోజు వరకు కూడా వారి సమస్య లను పరిష్కరించలేని దస్టీతిలొ ఉన్నారు అని ఘాటుగా వీమర్శించారు,104వ రోజు సీతమ్మ సాగర్ బహుళార్థక ప్రాజెక్టు భూ నిర్వాసితుల రిలే నిరాహార దీక్ష నందు ,సయ్యద్ ఇస్మాయిల్, నేలపట్ల నర్సిరెడ్డి, సయ్యద్ ఖాదర్, నేలపట్ల పకీర రెడ్డి ,నేలపట్ల సురేందర్ రెడ్డి , తదితర రైతులు దీక్షలో కూర్చున్నారు.,. ఈకార్యక్రమంలో వాసిరెడ్డి చలపతిరావు. అశ్వాపురం మండల టి డి పి అధ్యక్షులు తుళ్ళూరిప్రకాష్. మణుగూరు మండలం అధ్యక్షులు దొడ్డి కృష్ణ. బాబు. సాయిన్ సంపత్ తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: