మన్యం టీవి, ఆశ్వారావుపేట:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం అశ్వారావుపేట లోని స్థానిక రింగ్ రోడ్ సెంటర్ లో గల రైతు శిక్షణా కేంద్రం లో ఐ సీ డీ ఎస్ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంగన్వాడీ కార్యకర్తలకు చిరు ధాన్యాల అవగాహన సదస్సు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అశ్వారావుపేట ఎంపీపీ జల్లిపల్లి. శ్రీరామమూర్తి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆడబిడ్డలకు, బాల బాలికలకు పోషక ఆహారం అందించాలనే ఉద్దేశంతో జొన్నలు, రాగులు, కొర్రలు,సజ్జలు, వివిధ రకాల చిరుధాన్యాలను ప్రభుత్వం అంగన్వాడి కార్యకర్తల ద్వార బాల బాలికలకు,ఉచితంగా అందించడానికి అంగన్వాడి కార్యకర్తల కు అవగాహన కల్పిస్తుందని, ఈ చిరు ధాన్యాల వాళ్ళ బాల బాలికలకు మంచి పోషణ లభిస్తుందని,ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా బాల బాలికలకు పోషక పదార్థాలు అందించాలని ప్రభుత్వం చేస్తున్న ఈ కార్యక్రమానికి అశ్వారావుపేట మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు జల్లిపల్లి, శ్రీరామమూర్తి అభినందనలు తెలిపారు. అలాగే అంగన్వాడీ కార్యకర్తలు ఎంతో సేవ చేస్తున్నారని, కరోనా సమయంలో కూడా వారూ అందించిన సేవలు మరువలేనివి అని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు అశ్వారావుపేట సర్పంచ్ అట్టాం రమ్యా, సి డీ పీ ఓ రోజరాని, సూపర్ వైజర్స్ విజయలక్ష్మి, పద్మా,ఐ సీ డీ ఎస్ సిబ్బంది అంగన్వాడి కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: