మన్యం టీవి, పినపాక:
పినపాక మండల కాంగ్రెస్ పార్టీ X- రోడ్ కార్యాలయం లో అధ్యక్షులు గోడిశాల. రామనాధం గారు మీడియా సమావేశం ఏర్పాటు చేసి 2018 సంవత్సరంలో రేగా కాంతారావు కాంగ్రెస్ పార్టీ టికెట్ పై గెలిచి తెరాస పార్టీలోకి వెళ్లిపోయారు, ఆరోజు నుండి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దిక్కు లేని పక్షుల్లా బాధలకు గురైనారు.
ఆరోజునుండి *భద్రాచలం MLA మరియు భద్రాద్రి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు,టీపీసీసీ ఉపాధ్యక్షులు శ్రీ పోదెం వీరయ్య గారి నాయకత్వంలో*భద్రాద్రి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే దిశగా ముందుకు తీసుకోని వెళ్తున్నారు. అలానే పినపాక మండలంలో కూడా గ్రామ గ్రామానికి కాంగ్రెస్ పార్టీ ని తీసుకెళ్లి బలోపేతం చేస్తున్నాము. కానీ కొంత మంది స్వార్ధ పరులు పార్టీలోకి రాక ముందే టికెట్ కోసం పైరవీలు చేస్తున్నారు అని ప్రజలు అనుకుంటున్నారు. ఈ విధంగా పార్టీ లోకి రాకుండా ఎన్నికల సమయానికి వచ్చి టికెట్ తెచ్చుకుందాం అని అనుకునే వారికి మరియు పార్టీలు మారిన వారికి టికెట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదని ఆపటికప్పుడు వచ్చి ఏదో చేద్దాము అనుకునేవారికి టికెట్ ఇవ్వరని టికెట్ ఆశించేవారు ఇది ఆలోచించాల్సిన అవసరం ఉందని కోరుచున్నాము. గతంలో రాజకీయాలకు నేటి రాజకీయాలకు తేడా ఉందని రేవంత్ అన్న నాయకత్వంలో పార్టీ రెట్టింపు ఉత్సాహంతో దుసుకొని పోతుందని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ అన్న గారు కష్టపడి పనిచేసే కార్యకర్తలకే టికెట్ అవకాశం ఇస్తారని. కాంగ్రెస్ పార్టీ లో పనిచేయకుండా టికెట్ ఆశ పడితే అది నిరాశే అవుతుంది అని పార్టీలు మారిన వాళ్లకు టికెట్ ఈసారి అధిష్టానం ఇవ్వదని ఇలా అవకాశ వాద రాజకీయ నాయకులకు టికెట్ ఇవ్వొద్దని కష్ట కాలంలో కష్టపడి పనిచేసే కార్యకర్తలకే టికెట్ అధిష్టానం ఆలోచన చేసి ఇవ్వాలని ఆయన అధిష్టానానికి మీడియా ముఖం గా విజ్ఞప్తి చేశారు.
Post A Comment: