మన్యం టీవీ ఏటూరు నాగారం
హుజురాబాద్ ఉపఎన్నిక ప్రచారాన్ని మరింత వేడెక్కించబోతున్నారు. ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ మరియు ములుగు టిఆర్ఎస్ శ్రేణులు హుజురాబాద్ నియోజకవర్గంలోని ఇల్లంతకుంట మండలంలో ఆదివారం ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది.జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ మరియు ములుగు టిఆర్ఎస్ శ్రేణులు గడపగడపకు తిరుగుతూ ఓట్ల కోసం అభ్యర్థిస్తున్నారు. ప్రత్యర్థులపై విమర్శలు.. ఆరోపణలతో.. ప్రచారాన్ని మరింత వేడెక్కిస్తున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ మద్దతుగా ప్రచారం చేస్తున్నారు.దీంతో పాటు క్షేత్రస్థాయిలో పర్యటించేలా కార్యాచారణరూపొందిస్తున్నారు.ప్రతి పోలింగ్ బూత్లు కలిపి ఒక కేంద్రంగా ఏర్పాటు చేసి..ఆ స్థాయిలో ప్రజలను కలుసుకునేందుకు ఎన్నికల వ్యూహరచన చేస్తున్నారు. హుజురాబాద్లో ఇల్లంతకుంట మండల లో అన్ని పోలింగ్ బూత్లో ప్రచారం చేసేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.ఈ ప్రచారంలో ములుగు టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు ములుగు మండల అధ్యక్షుడు బాదం ప్రవీణ్, ఏటూరు నాగారం ఆత్మ చైర్మన్ దుర్గం రమణ,ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు పోరిక విజయ రామ్ నాయక్,సీనియర్ నాయకులు గోవింద నాయక్, మడుతనపల్లె మోహన్, రేణుగుంట్ల సురేష్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: