👉 పంట ప్రారంభదశలోనే ఎదురుదెబ్బ..
👉 అయోమయంలో అన్నదాత..
మన్యం టీవీ : జూలూరుపాడు, సెప్టెంబర్ 30, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండల పరిధిలోని మాచినేని పేట తండా గ్రామపంచాయతీ లోని జె త్య తండాకు చెందిన వాంకుడోత్ చిన్న, మరియు వాంకుడోత్ బిల్లు అను ఇరువురు రైతులు తాము సాగు చేస్తున్న మిరప తోట లకు గుబ్బ తెగులు ఆశించడం తో గురువారం సుమారు రెండు ఎకరాల మిరప తోటను పీకి దుక్కి చేశారు. తెగులు నివారణ కొరకు అనేక రకాల పురుగు మందులు పిచికారి చేసినప్పటికీ ఉపయోగం లేకుండా పోయిందని వాపోయారు. విత్తన లోపమా లేక వాతావరణ శాపమా తెలియని అయోమయంలో పడ్డారు. మండల వ్యాప్తంగా వందల ఎకరాల లో మిర్చి సాగు చేస్తున్న రైతులు వేల రూపాయలు పెట్టుబడికి వెచ్చించి పంటలు సాగు చేస్తున్నప్పటికీ, పంటలకు ఆశించే తెగుళ్ల నివారణకు సరైన పై మందులు ఏ కంపెనీలు ఇప్పటివరకు రైతులకు అందించలేక పోతున్నాయి. దీనికితోడు వ్యవసాయ శాఖ అధికారుల సూచనలను, సలహాలను రైతన్నలు పాటించకపోవడం కూడా ఒక కారణంగా చెప్పుకుంటున్నారు. వివిధ కంపెనీల హంగు, ఆర్బాటా ప్రచారాలకు, కంపెనీల ఏజెంట్లు చెప్పే మాయమాటలకు మంత్ర ముగ్ధులై రైతన్నలు మోసపోతున్నారు. ఏది ఏమైనప్పటికీ "దేశానికి ఎన్ను ముక్క రైతు" అన్నారు. ఇప్పుడు అదే రైతు నకిలీ విత్తనాల మాయగాళ్ళకు, పనిచేయ్యని పురుగు మందుల కంపెనీల కేటుగాళ్ల కు ఆదాయ వనరుగా ఎంపికయ్యాడు. ఈ అయోమయ సుడిగుండంలో పడి రైతన్న ఆదుకునే నాథుడు కోసం ఎదురు చూస్తున్నాడు. సంఘం నాగరాజు మన్యం టీవీ ప్రతినిధి జూలురుపాడు
Post A Comment: