న్యూ డెమోక్రసీ నాయకులు శంకరన్న
గుండాల సెప్టెంబర్ 30 (మన్యం మనుగడ) కుల నిర్మూలన కోసం ప్రతి ఒక్కరూ ఉద్యమించాల్సిన అవసరం ఉందని న్యూ డెమోక్రసీ నాయకులు శంకరన్న పిలుపునిచ్చారు. సత్యశోధక్ సమాజ్ 149వ ఆవిర్భావ దినోత్సవం సందర్భం తూరు బాకా గ్రామంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి సంవత్సరం సెప్టెంబరు 24 నుండి 30 వ తారీఖు వరకు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారని ఆయన పేర్కొన్నారు. భారతదేశంలో దళితులు, ఆదివాసీలు, మత మైనార్టీలు, బుద్ధి జీవులపై, ఫాసిస్ట్ శక్తులు సాగిస్తున్న దాడులకు వ్యతిరేకంగా ఉద్యమించాలన్నారు. కుల రహిత సమాజం కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో దుర్గం లక్ష్మీనారాయణ, ముసలయ్య , కిరణ్ , రమేష్ , తదితరులు పాల్గొన్నారు
Post A Comment: