మన్యం టీవీ : జూలూరుపాడు, అక్టోబర్ 23, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, 25,26,27, తేదీల్లో తమిళనాడులో జరిగే జాతీయ స్థాయి అండర్ 19 తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ పోటీల్లో పాల్గొనేందుకు జూలూరుపాడు మండలం సూరారం గ్రామానికి చెందిన కె.వీరభద్రం ఎంపికయ్యాడు. మహబూబాబాద్లో నిర్వహించిన జిల్లా స్థాయి అండర్-19 క్రికెట్ లీగ్ పోటీలో చూపిన ప్రతిభతో జాతియ స్థాయి పోటీలకు అర్హత సాధించాడు. ఈ నెల 6,7,8 తేదీల్లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరచడంతో జాతీయ స్థాయిలో నిర్వహించే పోటీల్లో పాల్గొనే జట్టులో స్థానం దక్కింది. కొర్రా మోతీలాల్, సుజాత దంపతుల కుమారుడైన వీరభద్రం కిన్నెరసాని గురుకులంలో పదో తరగతి చదువుతున్నాడు. పోటీలకు వెళ్లేందుకు సుమారు రూ. 20 వేల వరకు ఖర్చవుతుందని, పేద కుటుంబం కావడంతో ఎవరైనా చేయూత అందించాలని కోరుతున్నాడు.
Post A Comment: