CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

గత 20 సంవత్సరాలు పైగా చీకట్లో మగ్గుతున్న ఆదివాసీ గూడాన్ని సందర్శించిన ఆదివాసి నాయకపోడు సేవాసంఘం

Share it:



 మన్యంటీవి, అశ్వారావుపేట: గత 20 సంవత్సరాలుపైగా చీకట్లోనే కాలం వెళ్ళదిస్తున్నా ఆదివాసీ  గ్రామం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం, కొత్త గంగారం గ్రామము. ఆ గ్రామాన్ని ఆదివాసీ నాయకపోడు సేవ సంఘం శనివారం సాయంత్రం సందర్శించిది. ఈ సందర్బంగా ఆ సంఘం మండల అద్యుక్షులు నారం సీతారాంసింగ్ మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ళ పైనే గడుస్తున్నా ఇలా ఇంకా ఎన్నో ఆదివాసీ గ్రామాలు చీకట్లోనే మగ్గుతున్నాయనీ, ఆదివాసీలకు తమ చట్టాలపై తమకు అవగాహన లేకపోవడం వల్ల ఇలాంటి పరిస్థితులు చూడ వలసి వస్తుందని, కాబట్టి ప్రతి ఒక్క ఆదివాసి బిడ్డ అక్షరజ్ఞానం పెంచుకుని చట్టాలపై అవగాహన తెచ్చుకొని సమస్యలు పరిష్కరించుకోవడానికి ముందంజలో ఉండాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా ఆదివాసి నాయకపోడులకు ఎలాంటి సమస్యలు ఉన్నా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పరిష్కరించుకోవడానికి ఆదివాసీ నాయకపోడు సేవా సంఘం తోడ్పడుతుందని భరోసా కల్పించారు. అనంతరం ఆ గ్రామంలో గ్రామ కమిటీ నిర్వహించారు. గ్రామ కమిటీ లో అధ్యక్షులుగా నారం సూరిబాబు, ప్రధాన కార్యదర్శిగా నారం ముక్తేశ్వరావు, కోశాధికారిగా నారం వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షుడుగా మొగిలి నాగ ముత్యం, మహిళా అధ్యక్షురాలుగా నారం కన్నమ్మ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో వేదాంతపురం గ్రామ సర్పంచ్ సోమిని శివప్రసాద్, మండల ప్రధాన కార్యదర్శి దాది చంటి, ఉపాధ్యక్షులు సంఘం కృష్ణమూర్తి, కార్యవర్గ సభ్యులు  పూజరి పోతురాజు, రాజిని వెంకటేశ్వరావు, నల్లబాడు గ్రామ అధ్యక్షులు గెడ్డం వెంకటస్వామితో పాటు పలువురు పాల్గొన్నారు. 

Share it:

TELANGANA

Post A Comment: